Chandrababu: కందుకూరులో చంద్రబాబు సభ వద్ద అపశ్రుతి

  • నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
  • రద్దీ కారణంగా తీవ్ర తొక్కిసలాట 
  • స్పృహ కోల్పోయిన పలువురు
  • ఆసుపత్రికి పంపే ఏర్పాట్లు చేసిన చంద్రబాబు
Minor incident at Chandrababu Kandukur rally

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లా కందుకూరు విచ్చేశారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. కందుకూరులో రోడ్లు క్రిక్కిరిసి పోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. 

విపరీతమైన రద్దీ నెలకొనడంతో కార్యకర్తల మధ్య తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

 ఇది బాధాకరమైన ఘటన అని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, వారు క్షేమంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని తెలిపారు. ఈ ఘటన కారణంగా కందుకూరులో చంద్రబాబు ప్రసంగం ఆలస్యమైంది. బాధితుల పరిస్థితి తెలుసుకున్నాకే ప్రసంగిస్తానంటూ చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల కోసం సభను తాత్కాలికంగా నిలిపివేసిన చంద్రబాబు ఆసుపత్రికి తరలి వెళ్లారు. కార్యకర్తల పరిస్థితిని సమీక్షించి సభపై నిర్ణయం తీసుకుందామని నేతలకు తెలిపారు.

  • Loading...

More Telugu News