- కంఠాభరణాన్ని సమర్పించిన వైవీ దంపతులు
- ఆభరణం విలువ రూ.1.20 కోట్లు
- కానుక టీటీడీ అధికారులకు అందజేత
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు తిరుమల వెంకటేశ్వరస్వామికి విలువైన కానుక సమర్పించారు. శ్రీవారికి విశిష్టమైన కంఠాభరణాన్ని సమర్పించారు. ఈ ఆభరణం విలువ రూ.1.20 కోట్లు. ఈ కంఠాభరణాన్ని వైవీ సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ అధికారులకు అందజేశారు.
ఆలయాల అభివృద్ధికి టీటీడీ సహకారం
తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల అభివృద్ధికి టీడీపీ సహకారం అందిస్తోంది. తాజాగా తెలంగాణలోని కోరుట్ల నియోజకవర్గంలో 89 దేవాలయాలకు నిధులు కేటాయించింది. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున రూ.9.20 కోట్లు మంజూరు చేసింది.