మాచర్లలో ఉద్రిక్తత... పరస్పర దాడులు.. టీడీపీ కార్యాలయానికి నిప్పు..?
- మాచర్లలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం
- పరస్పరం ఎదురైన టీడీపీ, వైసీపీ శ్రేణులు
- కర్రలు, రాళ్లతో దాడులు
- జూలకంటి బ్రహ్మారెడ్డిని బలవంతంగా తరలించిన పోలీసులు
బ్రహ్మారెడ్డిని అక్కడినుంచి తరలించిన తర్వాత పరిస్థితులు మరింత అదుపుతప్పాయి. కొందరు వ్యక్తులు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టినట్టు తెలిసింది. మాచర్ల టీడీపీ నేత దుర్గారావు కారును కూడా తగలబెట్టారు.
ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేయాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిస్థితి అదుపుతప్పడంతో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేశారు.