గిల్ సెంచరీ... 450 దాటిన భారత్ ఆధిక్యం
- తొలి టెస్టులో విజయంపై కన్నేసిన భారత్
- రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా టీమిండియా బ్యాటింగ్
- రాణించిన గిల్, పుజారా
- కాసేపట్లో డిక్లేర్ చేసే అవకాశం
ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 55 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేయగా, పుజారా 74, కోహ్లీ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 471 పరుగులకు చేరింది. ఆటకు నేడు మూడో రోజే కావడంతో, బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే, మరో రెండ్రోజులు బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగానే కనిపిస్తోంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ ఫాలోఆన్ లో పడినప్పటికీ రెండో ఇన్నింగ్స్ ఆడడానికే భారత్ మొగ్గుచూపింది.