మా బాబర్ కంటే నిన్నే ఎక్కువ ఇష్టపడతాం: కోహ్లీని ఉద్దేశిస్తూ పాక్ ఫ్యాన్స్ ప్లకార్డులు
- ముల్తాన్ టెస్టు సందర్భంగా ఫ్యాన్స్ ప్లకార్డులు
- పాకిస్థాన్ కు వచ్చి ఆసియా కప్ ఆడాలని విన్నపం
- వచ్చే ఏడాది పాక్ లో జరగనున్న ఆసియా కప్
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో ఆసియా కప్ జరగనుంది. అయితే, పాకిస్థాన్ లో తాము ఆడబోము అని భారత్ స్పష్టం చేసింది. తమ దేశంలో ఆసియా కప్ ఆడకపోతే... ఇండియాలో జరిగే ప్రపంచకప్ లో తాము ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయినప్పటికీ బీసీసీఐ పట్టించుకోలేదు. పాకిస్థాన్ లో ఆడటమనేది బీసీసీఐ తీసుకునే నిర్ణయం కాదని... ఇది భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే.... తమ దేశానికి వచ్చి ఆసియా కప్ ఆడాలంటూ కోహ్లీని పాక్ అభిమానులు కోరారు.