Jagan: కాసేపట్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో జగన్ కీలక భేటీ

  • ప్రతి 50 మంది ఓటర్లకు పార్టీలోని ఇద్దరిని వాలంటీర్లుగా నియమించాలనుకుంటున్న జగన్
  • ఐప్యాక్ నివేదికపై చర్చించే అవకాశం
  • పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్న జగన్ 
Jagan to held meeting with party leaders

వైసీపీ జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 మంది ఓటర్లకు పార్టీలో పని చేస్తున్న ఇద్దరిని వాలంటీర్లుగా నియమించాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కీలక భేటీని నిర్వహించబోతున్నారు. 

ఇదే సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఐప్యాక్ అందించిన నివేదికపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా మార్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. గడపగడపకు కార్యక్రమంపై రిపోర్టును పార్టీ శ్రేణుల ముందు ఉంచి, వారికి సూచనలు చేయనున్నారు.

More Telugu News