YS Vijayamma: ఇప్పుడు జగన్ తో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా?: వైఎస్ విజయమ్మ

  • పోలీసుల అదుపులో షర్మిల
  • లోటస్ పాండ్ నివాసంలో విజయమ్మ నిరాహార దీక్ష
  • జగన్ స్పందన ఏంటని అడిగిన మీడియా ప్రతినిధి
  • నవ్వుతూ బదులిచ్చిన విజయమ్మ
YS Vijayamma cool reply to a reporter who asked Jagan response on Sharmila arrest

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నివాసంలో దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

జరిగిన పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడారా... ఎంతైనా సిస్టర్ కదా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అందుకు విజయమ్మ స్పందిస్తూ, 'ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో, ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా' అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఓ అన్నగా జగన్ మోహన్ రెడ్డి ఏమన్నాడు? అంటూ ఆ రిపోర్టర్ తిరిగి ప్రశ్నించగా, విజయమ్మ మళ్లీ అదే సమాధానం చెప్పారు. 

కాగా, తాజా పరిణామాలపై షర్మిల తదుపరి కార్యాచరణను ప్రకటిస్తారని ఆమె పేర్కొన్నారు. తనను షర్మిల వద్దకు పోనివ్వడం లేదు కాబట్టి నిరాహార దీక్షకు దిగానని తెలిపారు.

More Telugu News