బాలిలో మోదీ-రిషి సునాక్ భేటీ.. కాసేపటికే భారత్కు తియ్యటి కబురు చెప్పిన బ్రిటన్
- జీ20 సదస్సులో కలుసుకున్న మోదీ, రిషి సునాక్
- ఆ తర్వాత కాసేపటికే వీసాలపై ప్రకటన చేసిన బ్రిటన్ ప్రభుత్వం
- భారత యువ ప్రొఫెషనల్స్కు ప్రతి ఏడాది 3 వేల వీసాల ప్రకటన
బ్రిటన్ ప్రధాని సునాక్, భారత ప్రధాని మోదీ జీ20 సమ్మిట్లో కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం. బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కిన సునాక్.. మోదీని కలవడం ఇదే తొలిసారి. జీ20 సమ్మిట్లో యూకే, భారత ప్రధానులు కలుసుకుని మాట్లాడినట్టు మోదీ కార్యాలయం ట్వీట్ చేసింది.