టీ20 ప్రపంచకప్ లో థర్డ్ అంపైర్ మరో తప్పిదం.. బంగ్లా కెప్టెన్ షకీబ్ షాక్
- బంగ్లా కెప్టెన్ షకీబ్ ఔట్ నిర్ణయం వివాదాస్పదం
- బంతి ముందుగా బ్యాట్ ను తాకినా ఎల్బీ ఇచ్చిన థర్డ్ అంపైర్
- అసహనం వ్యక్తం చేసిన షకీబ్
రివ్యూలో బంతికి ముందుగా బ్యాట్ ను తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్ లో చాలా స్పష్టంగా స్పైక్ కనిపించింది. ఆ తర్వాతే బంతి షకీబ్ ప్యాడ్లను తాకింది. కానీ, ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ డబ్ల్యూ ఇచ్చాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చినట్టు పేర్కొన్నాడు. కానీ, స్పైక్ వచ్చిన సమయంలో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ టీవీ రీప్లేల్లో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లా కెప్టెన్ షకీబ్ షాకయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. అంతకుమించి చేసేదేమీ లేక మైదానం వీడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. దాంతో, బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితం అయింది.