ఒడిశాలో 400 మంది మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు
- అల్లూరి సీతారామరాజు, మల్కనగిరి జిల్లాలోని పలు గ్రామాలకు చెందినవారు లొంగుబాటు
- ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చూశాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న మావోయిస్టు సానుభూతిపరులు
- నక్సల్స్ను తమ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకుంటామని ప్రతిజ్ఞ
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూశాకే తాము లొంగిపోయినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులకు పోలీసు ఉన్నతాధికారులు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా సౌత్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీ రాజేశ్ పండిట్ మాట్లాడుతూ.. మావోయిస్టులను తమ ప్రాంతంలోకి ప్రవేశించనివ్వబోమని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేసినట్టు చెప్పారు. రెబల్స్కు వ్యతిరేకంగా జరిగే పోరులో పోలీసులకు సహకరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.