సిక్కింలో స్టేజీపై రాష్ట్రపతి నృత్యం
- కాలు కదిపిన ముఖ్యమంత్రి భార్య కృష్ణా రాయ్
- సిక్కింలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ఉత్తర భారతంలో అందమైన రాష్ట్రమని మెచ్చుకోలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్యాంగ్ టక్ లో ‘సమైక్య నృత్యం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై స్థానిక కళాకారుల బృందం నృత్యం చేస్తుండగా.. కృష్ణా రాయ్ తో కలిసి రాష్ట్రపతి ముర్ము కాలుకదిపారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.