కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఖర్గే
- ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం
- సోనియా, రాహుల్, ప్రియాంక సహా ముఖ్య నేతలు హాజరు
- అంతకుముందు రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఖర్గే
గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ ఎంపీలు, పీసీసీ, సీఎల్పీ నేతలు దీనికి హాజరయ్యారు. అంతకుముందు ఖర్గే రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు.