కేదార్ నాథ్ లో ప్రధాని.. స్థానిక సంప్రదాయ వస్త్రధారణలో మోదీ!
- హిమాచలి సంప్రదాయ వస్త్రాలైన చోలా డోరాతో కనిపించిన ప్రధాని
- కేదార్ నాథ్ ఆలయంలో పూజలు
- అనంతరం బద్రీనాథ్ ఆలయ సందర్శన
- పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాలను పూలతో అలంకరించారు. హిమాచలి సంప్రదాయ వస్త్రధారణతో ప్రధాని మోదీ మొదటి సారి దర్శనమిచ్చారు. చోలా డోరా ధరించి కేదార్ నాథ్ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి నుంచి బద్రీనాథ్ ఆలయానికి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.