రూపాయి విలువ పడిపోవడానికి కారణం ఇదే: నిర్మలా సీతారామన్
- భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల వల్లే క్షీణత అన్న ఆర్థిక మంత్రి
- ఈడీ స్వతంత్రంగా తన పని తాను చూసుకుంటోందని వ్యాఖ్య
- అమెరికా పర్యటనలో ఉన్న నిర్మల
ఈడీ పూర్తి స్వతంత్ర సంస్థ అని స్పష్టం చేశారు. ‘ఈడీ నేరాలను అంచనా వేసి ముందుకెళ్తుంది. పూర్తి స్వతంత్రంగా ఉంటుంది. పలు దర్యాప్తుల్లో గొప్పగా నిలిచిన సందర్భాలున్నాయి. అధికారుల చేతిలో తగిన ప్రాథమిక సాక్ష్యాలు దీనికి కారణం’ అని నిర్మల పేర్కొన్నారు. జీ20 దేశాలు, దాని ప్రాధాన్యతల గురించి కూడా నిర్మల మాట్లాడారు. ‘మేము చాలా మంది జీ20 సభ్యులతో ద్వైపాక్షిక చర్చలు జరిపాము. చాలా సవాళ్లు ఉన్న సమయంలో నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నాం. పాశ్చాత్య దేశాలు విద్యుత్తు కోసం బొగ్గు వైపు వెళ్తున్నాయి. కేవలం భారత్ మాత్రమే కాదు, అనేక దేశాలు ఇంధన ఉత్పత్తి కోసం తిరిగి బొగ్గును ఆశ్రయించాల్సి వస్తోంది’ అని అభిప్రాయపడ్డారు.