కశ్మీరీ పండిట్ ను కాల్చి చంపిన టెర్రరిస్టులు

Terrorists kills Kashmiri Pandit in Kashmir
  • షోపియాన్ జిల్లాలో దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు
  • పురాణ్ కృష్ణన్ అనే కశ్మీరీ పండిట్ ను హత్య చేసిన వైనం
  • ముష్కరుల కోసం గాలిస్తున్న బలగాలు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీరీ పండిట్లను టార్గెట్ గా చేసుకుని వారు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు మరోసారి దాడికి తెగబడ్డారు. పురాణ్ కృష్ణన్ అనే కశ్మీరీ పండిట్ ను కాల్చి చంపారు. షోపియాన్ జిల్లాలోని చౌదరి గుండ్ ఏరియాలో ఆయన ఇంటి వద్దే చంపేశారు. 

సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. పురాణ్ కృష్ణన్ కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటి నుంచి ఆయన ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదని స్థానికులు తెలిపారు. ఎక్కువగా ఇంట్లోనే గడిపే వారని చెప్పారు. ఆయన హత్యతో బంధువులు భయాందోళనలకు గురవుతున్నారు.
Go Back to Shorts
Jammu And Kashmir
Kashmiri Pandit
Shot Dead

More Telugu News