Andhra Pradesh: ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై తెలుగు రాష్ట్రాలు స‌హా కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

  • ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు త‌ప్ప‌నిస‌రి
  • ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని కేంద్ర ప్ర‌భుత్వం
  • కేంద్రం తీరును ప్ర‌శ్నిస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌
  • 8 వారాల‌కు విచార‌ణ‌ను వాయిదా వేసిన కోర్టు
supreme court notices ti telugu states and union government and election commission over assembly sears hike in andhra pradesh

ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై బుధ‌వారం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచాల్సి ఉంది. అయితే ఆ దిశ‌గా ఇప్ప‌టిదాకా కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. కేంద్రం తీరును నిర‌సిస్తూ ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య‌ను పెంచేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖ‌లైన ఓ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

ఈ విచార‌ణ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వం, కేంద్ర ఎన్నిక‌ల సంఘాల‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారంపై 4 వారాల్లోగా కౌంట‌ర్లు దాఖ‌లు చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంత‌రం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను 8 వారాల‌కు వాయిదా వేసింది.

More Telugu News