పశ్చిమ బెంగాల్లో వ్యాపారుల జాక్పాట్.. దసరా వేడుకల్లో రూ. 40 వేల కోట్ల వ్యాపారం!
- పశ్చిమ బెంగాల్లో 40 వేల దుర్గా మండపాల ఏర్పాటు
- ఒక్క కోల్కతాలోనే 3 వేలకుపైగా మండపాలు
- మూడు లక్షల మందికి దొరికిన ఉపాధి
- ప్రతి సంవత్సరం మూడు నాలుగు నెలల పాటు వ్యాపారం సాగుతుందన్న ఎఫ్ఎఫ్డీ చైర్మన్ పార్థా ఘోష్
దసరా ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు భాగస్వాములవుతారని పార్థా ఘోష్ తెలిపారు. వీరిలో మండపాలు నిర్మించేవారు, విగ్రహాలు తయారుచేసేవారు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, పూజారులు, వాద్యకారులు, కూలీలు, కేటరింగ్ సేవలందించేవారు ఉంటారని ఆయన వివరించారు. ఉత్సవాల సందర్భంగా వీరందరికీ ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.