Team India: దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్ కు కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి

  • భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్
  • 2-0తో నెగ్గిన రోహిత్ సేన
  • రేపు ప్రాధాన్యం లేని మ్యాచ్
  • టీమిండియాలో మార్పులు
Team India rested Kohli and KL Rahul

దక్షిణాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలిచింది. ఈ నేపథ్యంలో, ఇరుజట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు (అక్టోబరు 4) ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. 

ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా ఎలాంటి ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ కోసం జట్టులో కొన్ని మార్పులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి కల్పించింది. మరికొన్నిరోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన బ్యాట్స్ మెన్ పై భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రేపటి మ్యాచ్ లో కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తుదిజట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News