ముంబయిలో రూ.1476 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Huge amount of drugs seized in Mumbai
  • విదేశీ కమలా ఫలాల బాక్సుల్లో డ్రగ్స్ అక్రమ రవాణా
  • 207 కిలోల హై ప్యూరిటీ డ్రగ్స్ స్వాధీనం
  • డ్రగ్స్ దిగుమతిదారును అరెస్ట్ చేసిన డీఆర్ఐ
  • డ్రగ్స్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు అనుమానం
భారత్ లో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. నవీ ముంబయిలో 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్, 9 కిలోల హై ప్యూరిటీ కొకైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదకద్రవ్యాల విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్ ను వాలెన్షియా రకం విదేశీ కమలా ఫలాల బాక్సుల్లో ఉంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. 

కాగా, ఈ హై ప్యూరిటీ డ్రగ్స్ తీసుకున్నవారికి ఆ మత్తు 12 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ ను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 

ఈ డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్న వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన కస్టమ్స్ హౌస్ ఏజెంట్ కోసం, స్థానిక మాదకద్రవ్యాల నెట్ వర్క్ సభ్యుల కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Drugs
Navi Mumbai
DRI
Oranges
South Africa

More Telugu News