మీ కారును నేను కూడా భరించలేను: మెర్సిడెస్ బెంజ్ తో నితిన్ గడ్కరీ
- బెంజ్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లు
- ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 335 శాతం పెరిగాయన్న గడ్కరీ
- దేశంలో ప్రస్తుతం 15.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని వెల్లడి
మీ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని... ఉత్పత్తిని పెంచితేనే ధరలను కొంచెం తగ్గించడం సాధ్యమవుతుందని గడ్కరీ అన్నారు. తామంతా మధ్య తరగతి ప్రజలమని... తాను కూడా మీ కారు ధరను భరించలేనని చెప్పారు. బెంజ్ తయారు చేసిన ఎలెక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లుగా ఉంది. ప్రస్తుతం దేశంలో 15.7 లక్షల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 335 శాతం పెరిగాయని చెప్పారు. దేశంలో ఎక్స్ ప్రెస్ హైవేలు వస్తుండటం వల్ల ఈవీ కార్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని అన్నారు.