Krishnam Raju: ఘనంగా కృష్ణంరాజు సంస్మరణ సభ.. టన్నుల కొద్దీ ఆహారం.. మెనూ ఇదే!

  • లక్ష మందికి నోరూరించే వంటకాలు
  • 6 టన్నుల మటన్ బిర్యానీ, 6 టన్నుల చికెన్ బిర్యానీ
  • 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల చికెన్ కర్రీ
Food menu in Krishnam Raju Samsmarana Sabha

రెబెల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ ఈరోజు మొగల్తూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ కూడా రావడంతో మొగల్తూరు అభిమానులతో పోటెత్తింది. దాదాపు లక్ష మందికి నోరూరించే వంటకాలను వడ్డించారు. టన్నుల కొద్దీ వంటకాలను వండారు. వంటకాల్లో ప్రధానంగా... 6 టన్నుల మటన్ బిర్యానీ, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, 1 టన్ను రొయ్యల ఇగురు, 1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను బొమ్మిడాయల పులుసు, 2 లక్షల బూరెలు తయారు చేశారు. మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలని వండించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

More Telugu News