హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ షోరూంలో భారీ చోరీ.. రూ. 70 లక్షల విలువైన సెల్ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగ!
- ఈసీఐఎల్ చౌరస్తాలో ఘటన
- వెంటిలేటర్ ఇనుప చువ్వలు తొలగించి లోపలికి దూకిన దొంగ
- సెల్ఫోన్లు తప్ప మిగతా వస్తువుల జోలికి వెళ్లని వైనం
- తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానం
నిన్న ఉదయం షోరూం తెరిచిన సిబ్బంది చోరీ విషయాన్ని గుర్తించారు. సంస్థ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు షోరూంకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఓ సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను బట్టి చోరీకి పాల్పడింది ఒక్కడేనని పోలీసులు నిర్ధారించారు. అతడికి ఇంకెవరైనా సహకరించి ఉంటారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఇది తెలిసినవారి పనేనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేరుగా సెల్ఫోన్లు ఉండే చోటు వద్దకు వెళ్లడం ఇందుకు ఊతమిస్తోంది. సెల్ఫోన్లు కొనేందుకు వచ్చి రెక్కీ నిర్వహించి పథకం ప్రకారమే చోరీ చేసినట్టు అనుమానిస్తున్నారు.