ఏపీ సీఎం వైఎస్ జగన్తో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ
- తాడేపల్లి వచ్చిన టాటా సన్స్ చైర్మన్
- ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై జగన్తో సమావేశం
- సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని జగన్ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను చంద్రశేఖరన్కు ఆయన వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పాలుపంచుకున్నారు.