భారత్ నుంచి ఆస్కార్ కు గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'... 'ఆర్ఆర్ఆర్'కు తీవ్ర నిరాశ
- ఆస్కార్ కు భారత్ అధికారిక ఎంట్రీ ఖరారు
- అనూహ్య రీతిలో అవకాశం దక్కించుకున్న ఛెల్లో షో
- పన్ నళిన్ దర్శకత్వంలో చిత్రం
- జ్యూరీలో చర్చకు వచ్చిన ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్
తమ చిత్రం ఆస్కార్ కు వెళుతుండడం పట్ల దర్శకుడు పన్ "ఓ మై గాడ్" అంటూ సంతోషం వ్యక్తం చేశారు. పన్ నళిన్ ఇదివరకు సంసార, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
కాగా, భారత్ నుంచి ఆస్కార్ కు వెళ్లే చిత్రం ఎంపికపై జ్యూరీలో పెద్ద చర్చే నడిచింది. కొన్ని మలయాళ చిత్రాలు, తెలుగు నుంచి ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యంగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కు వెళ్లడం ఖాయమని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి అంచనాల్లేని ఛెల్లో షో చిత్రం ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.