Andhra Pradesh: జీవీఎంసీ నూత‌న క‌మిష‌న‌ర్‌గా రాజ‌బాబు నియామ‌కం

  • జీవీఎంసీ క‌మిష‌న‌ర్ ల‌క్ష్మీషా బ‌దిలీ
  • ల‌క్ష్మీషా స్థానంలో జీవీఎంసీ క‌మిష‌న‌ర్‌గా రాజ‌బాబు
  • ఏపీ అర్బ‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్టర్ ‌గా ల‌క్ష్మీషా
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం
rajababu appointed as gvmc new commissioner

ఏపీలో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. గ్రేట‌ర్ విశాఖప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీవీఎంసీ) క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతున్న ల‌క్ష్మీషాను ఆ పోస్టు నుంచి బ‌దిలీ చేసింది. ఏపీ అర్బ‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్ మేనేజింగ్ డైకెర్ట‌ర్‌గా ల‌క్ష్మీషాను నియ‌మించింది. ల‌క్ష్మీషా బ‌దిలీ నేప‌థ్యంలో జీవీఎంసీ నూత‌న క‌మిష‌న‌ర్‌గా రాజ‌బాబును నియ‌మించింది. ఈ మేర‌కు సోమ‌వారం ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

More Telugu News