నేనుగానీ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగిస్తే మాయమైపోయేవారు.. కాంగ్రెస్ పై గులాం నబీ ఆజాద్ ఫైర్
- తనపై క్షిపణులు ప్రయోగిస్తే.. రైఫిల్ తో ధ్వంసం చేశానని వ్యాఖ్య
- రాజీవ్ గాంధీ తనకు సోదరుడి లాంటి వాడని.. ఇందిర తల్లి వంటిదని వ్యాఖ్య
- అందుకే వారిపై విమర్శలు చేయదలచుకోలేదని వివరణ
ఇందిరాగాంధీని తల్లిలా భావించా..
కాంగ్రెస్ పార్టీకి తన రక్తం ధారపోస్తే, ఆ పార్టీ తనను విస్మరించిందని కొన్నిరోజుల క్రితం ఆజాద్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ తరచూ విమర్శలు గుప్పిస్తున్న ఆజాద్.. తాజాగా జమ్మూకశ్మీర్ లో నిర్వహించిన ఓ సభలో మరోసారి మండిపడ్డారు. అయితే మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలపై మాత్రం ఆజాద్ ప్రశంసలు కురిపించారు. 52 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను రాజీవ్ గాంధీని సోదరుడిలా, ఇందిరా గాంధీని తల్లిలా భావించానని చెప్పారు. అందుకే వారి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు.