Mahesh Babu: రన్నింగ్ బస్ లో మహేశ్ ఫైట్ హైలైట్ అవుతుందట!

  • మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు 
  • వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డే 
  • సంగీత దర్శకుడిగా తమన్
Mahesh and Trivikram movie update

మహేశ్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అందుకోసం అవసరమైన సెట్స్ ను హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నారు.

ఫస్టు షెడ్యూల్లో ముందుగా మహేశ్ బాబు .. కొంతమంది ఫైటర్లు పాల్గొనగా, రన్నింగ్ బస్సులో ఫైట్ ను చిత్రీకరిస్తారట. ఈ ఫైట్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. చాలా డిఫరెంట్ గా ఈ ఫైట్ ను కంపోజ్ చేయడం జరిగిందని అంటున్నారు. మహేశ్ కెరియర్ లో రిస్కీ ఫైట్స్ ఈ సినిమాలో ఉండనున్నాయని చెబుతున్నారు. 

మహేశ్ బాబు జోడీగా ఈ సినిమాలో పూజ హెగ్డే అలరించనుంది. 'మహర్షి' తరువాత మహేశ్ తోను .. 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' సినిమాల తరువాత త్రివిక్రమ్ తోను ఆమె చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఆమెకి హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి. హారిక అండ్ హాసిని బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News