ప్రతి పథకంలోనూ కేంద్రం వాటా ఉంది: నిర్మలా సీతారామన్
- జహీరాబాద్ పార్లమెంటులో పర్యటించిన నిర్మల
- తిరుగు ప్రయాణంలో హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన వైనం
- కేంద్రం లోగోలు, ప్రధాని ఫొటోలను ఎందుకు వినియోగించరన్న కేంద్ర మంత్రి
రాష్ట్రాలు అమలు చేసే పథకాల్లో 60 శాతం వాటా కేంద్రానిదేనన్న నిర్మల... కేవలం 40 శాతం నిధులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని తెలిపారు. అలాంటప్పుడు ఆయా పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తొలగిస్తాయని ఆమె ప్రశ్నించారు. ఆయా పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ లొగోలను, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను ఎందుకు వినియోగించరని ఆమె ప్రశ్నించారు. అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్నందున... ఆ నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్ చేశామని నిర్మల చెప్పారు.