కడప జిల్లాలో జగన్ పర్యటన... వేల్పుల సచివాలయ భవనాన్ని ప్రారంభించిన సీఎం
- గన్నవరం నుంచి కడప ఎయిర్ పోర్టు చేరుకున్న జగన్
- అక్కడి నుంచి వేల్పుల గ్రామం చేరిన ఏపీ సీఎం
- రేపు వైఎస్సార్ ఘాట్లో తన తండ్రికి నివాళి అర్పించనున్న వైనం
ఈ కార్యక్రమం అనంతరం వేంపల్లి మండల పరిధిలోని ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకోనున్న జగన్... ఈ రాత్రికి అక్కడి తన గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. రేపు ఉదయం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ ఘాట్లో నివాళి అర్పిస్తారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత రేపు రాత్రి కూడా ఇడుపులపాయ గెస్ట్ హౌస్లోనే బస చేయనున్న జగన్...ఎల్లుండి ఉదయం తిరిగి కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం విమానాశ్రయం, అక్కడి నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకుంటారు.