ఎన్డీయేలో టీడీపీ చేరబోతోంది: రఘురామకృష్ణరాజు

  • సంచలన వ్యాఖ్యలు చేసిన రఘురాజు 
  • విశ్వసనీయ సమాచారం ఉందని వెల్లడి 
  • చర్చనీయాంశమైన రఘురాజు వ్యాఖ్యలు  
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ చేరబోతోందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి విశ్వసనీయమైన సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. రఘురాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి.  మరి... ఆయన చెప్పినట్టు ఎన్డీయేలో టీడీపీ చేరుతుందా? లేదా? అనే విషయం తెలియాలంటే వేచి చూడాలి.


More Telugu News

Raghu Rama Krishna Raju YSRCP Telugudesam Chandrababu Narendra Modi bj NDA