రేపు విజయవాడకు జస్టిస్ ఎన్వీ రమణ... సీఎం జగన్తో కలిసి కోర్టు భవనాలను ప్రారంభించనున్న సీజేఐ
- తిరుమలలో వెంకన్నను దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
- రాత్రికి తిరుపతిలో బస చేయనున్న సీజేఐ
- రేపు విజయవాడలో సిటీ సివిల్ కోర్టుల భవనాన్ని ప్రారంభించనున్న చీఫ్ జస్టిస్
విజయవాడలోని సిటీ సివిల్ కోర్టుల భవన ప్రాంగణంలో నూతనంగా బహుళ అంతస్తులతో కూడిన సిటీ సివిల్ కోర్టుల భవన సముదాయాన్ని ఏపీ ప్రభుత్వం ఇటీవలే నిర్మించిన సంగతి తెలిసిందే. రేపటి విజయవాడ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి జస్టిస్ ఎన్వీ రమణ నూతన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించన్నారు.