ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్కు తెలంగాణతో లింకు ఉందని బీజేపీ ఎంపీ ఆరోపణ
- డీల్ తెలంగాణలోనే జరిగిందన్న ఎంపీ పర్వేశ్ వర్మ
- ఆ రాష్ట్రం వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లకు మనీశ్ వెళ్లాడని ఆరోపణ
- ఇందులో 10-15 మంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నారన్న పర్వేశ్
‘ఈ స్కామ్ కు తెలంగాణతో సంబంధం ఉంది. డీల్ సెట్ చేయడానికి తెలంగాణకు చెందిన వాళ్లు బుక్ చేసిన హోటళ్లు, రెస్టారెంట్లను మనీశ్ సిసోడియా సందర్శించారు. ఇందులో 10-15 మంది ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ వ్యక్తులతో పాటు సిసోడియా ఉన్నారని నేను భావిస్తున్నాను’ అని వర్మ ఆరోపించారు. ఇక ఈ కేసులో సీబీఐ సిసోడియా నివాసంలో ప్రస్తుతం సోదాలు చేస్తోంది. ఈ కేసులో సిసోడియాతో పాటు మరో ముగ్గురు ప్రజా ప్రతినిధుల పేర్లను ఎఫ్ఐ ఆర్ లో చేర్చింది.