యూపీలో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన యువకుడి అరెస్ట్
- భారత్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
- హర్ ఘర్ తిరంగా పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
- ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలని ఆకాంక్ష
- ఖుషీనగర్ లో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన సల్మాన్ అనే వ్యక్తి
ఆ వ్యక్తి ఇంటి మీద పాకిస్థాన్ జెండా ఎగురుతుండడం గమనించిన స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సల్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ పాకిస్థాన్ జెండాను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు జెండాను రూపొందించిన అతడి బంధువు షెహనాజ్, పతాకావిష్కరణలో సాయపడిన ఇమ్రాన్ అనే మైనర్ బాలుడిపైనా కేసు నమోదు చేశారు.