మన నిఖత్ బంగారం... కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్ లో పసిడి పంచ్

  • 50 కిలోల విభాగంలో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్
  • ఫైనల్లో కార్లీ మెక్ నాల్ పై విజయం
  • 5-0తో నిఖత్ కే ఓటేసిన జడ్జిలు
  • భారత్ ఖాతాలో 17వ స్వర్ణం
  • నాలుగోస్థానానికి ఎగబాకిన భారత్
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పంచ్ విసిరింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్ ఇవాళ జరిగిన ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్ కు చెందిన కార్లీ మెక్ నాల్ పై విజయం సాధించింది. ఈ బౌట్ లో జడ్జిలు 5-0తో నిఖత్ కే ఓటేశారు. 

కాగా, నిఖత్ సాధించిన స్వర్ణంతో భారత్ కామన్వెల్త్ క్రీడల పతకాల పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు సహా మొత్తం 48 పతకాలు ఉన్నాయి. 

Nikhat Zareen
Gold
Boxing
Commonwealth Games
India

More Telugu News