నా మిత్రుడు రజనీకాంత్ మాదిరి మరొకరు ఉండరు: అనుపమ్ ఖేర్

  • ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద కలుసుకున్న మిత్రులు
  • ఆజాదీకా అమృతోత్సవ్ కార్యక్రమానికి హాజరు
  • ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోను పంచుకున్న అనుపమ్ ఖేర్
ఒకరు దక్షిణాది స్టార్. మరొకరు ఉత్తరాది స్టార్. వారిద్దరూ ఒక్క చోట కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. వారే రజనీకాంత్, అనుపమ్ ఖేర్. ఆదివారం రాష్ట్రపతి భవన్ వద్ద వీరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోలు తీసుకున్నారు. రజనీకాంత్ తన మిత్రుడంటూ ఈ ఫొటోను అనుపమ్ ఖేర్ అందరితో పంచుకున్నారు.

నా స్నేహితుడు రజనీకాంత్ మాదిరి మరొకరు ఉండరు. ఎప్పటికీ లేరు, ఉండరు. జైహో అజాదీకా అమృతోత్సవ్’’అంటూ ఇన్ స్టా గ్రామ్ లో అనుపమ్ ఖేర్ పోస్ట్ పెట్టారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర సర్కారు ఆజాదికా అమృతోత్సవ్ పేరిట ఉత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న ఈ ఉత్సవాలకు అనుపమ్ ఖేర్, రజనీకాంత్ హాజరయ్యారు.

Anupam Kher
Rajinikanth
meets
Rashtrapati Bhawan

More Telugu News