కిడ్నీ ఫెయిల్యూర్ అయి.. 'మహాభారత్' సీరియల్ నటుడు మృతి
- రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్న రసిక్ దవే
- 1982లో గుజరాతీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రసిక్
- ఆయన భార్య కేతకి కూడా పాప్యులర్ నటి
1980లలో ప్రసారమై, యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన 'మహాభారత్' సీరియల్ లో ఆయన నంద్ పాత్రను పోషించి, మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 1982లో గుజరాతీ సినిమా 'పుత్ర వధు' ద్వారా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో గుజరాతీ సినిమాలు, టీవీ షోలలో నటించారు. 2006లో 'నాచ్ బలియే' అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. కేతకి దవే అనే నటిని ఆయన పెళ్లి చేసుకున్నారు. గుజరాత్ లో ఆమె కూడా పాప్యులర్ నటి కావడం గమనార్హం. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.