ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఫొటోలు ఇవిగో!
- విలీన మండలాలను ముంచెత్తిన వరద గోదావరి
- రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు
- ఈ రాత్రికి భద్రాచలంలో బస చేయనున్న టీడీపీ అధినేత
ఈ రోజు ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని శివకాశీపురం, కుక్కునూరు గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. అలాగే తెలంగాణలోని బూర్గంపహాడ్ లో పర్యటించబోతున్నారు. రాత్రికి ఆయన భద్రాచలంలో బస చేయనున్నారు. రేపు ఏపీకి చెందిన ఎటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని కోతులగుట్ట, తోటపల్లి, రేఖపల్లి, కూనవరం ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.







