భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయంలో 204 ఏళ్లనాటి రెండు అణాల రాగినాణెం.. వెనక సీతారాముల బొమ్మ!
- భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయ హుండీలో లభించిన నాణెం
- 1818లో యూకేలో ముద్రించిన ఈస్టిండియా కంపెనీ
- ముందువైపు ఓం, వెనకవైపు ఆంజనేయ సమేత సీతారాములు
- వేలం వేస్తే భారీ ధర పలికే అవకాశం
నాణెం ముందువైపు ఈస్టిండియా కంపెనీ అని ఇంగ్లిష్లో రాసి ఉంది. మధ్యభాగంలో పైన అటుఇటు వెలుగుతున్న జ్యోతుల మధ్య ‘ఓం’ రాసి ఉంది. దానికింద కమలం పువ్వు, దానికి అటుఇటు ‘యూకే’ అని రాసి వుంది. రెండు అణాలు అని రాసి ఉన్న దీని కింద భాగంలో 1818 అని తయారైన సంవత్సరాన్ని ముద్రించారు. వెనకవైపు ఆంజనేయ సమేత సీతారాముల బొమ్మను ముద్రించారు. వేలం వేస్తే ఈ నాణేనికి భారీ ధర పలికే అవకాశం ఉందని చెబుతున్నారు.