ఈ చిన్న గిరిజన గ్రామం.. ఆనంద్ మహీంద్రాకు తెగనచ్చేసిందట!
- కేరళలోని ఎన్నోర్ లో ఏర్పాటు
- గత నెలలోనే పూర్తయిన వినూత్న ప్రాజెక్టు
- అద్భుతంగా ఉందన్న ఆనంద్ మహీంద్రా
2010లో అప్పటి సబ్ కలెక్టర్ ప్రశాంత్ నాయర్ ఈ ప్రాజెక్టుకు పునాది వేయగా.. గత నెలలోనే ఇది పూర్తయింది. స్థానిక గిరిజన తెగలతోనే దీన్ని నిర్మింపజేశారు. ఈ ప్రాజెక్టు అందాలు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంట్లో పడ్డాయి. ఆయన తన ట్విట్టర్ పేజీలో దీనిని షేర్ చేశారు.
‘‘ఇది ఎంతో అందంగా ఉంది. కేరళ టూరిజమ్ కు ధన్యవాదాలు. ఈ గ్రామం సహజ నిర్మాణ రూపకల్పన అద్భుతంగా ఉంది. సింప్లిసిటీ ఎంత అద్భుతంగా ఉంటుందో చూపిస్తోంది’’ అని మహీంద్రా పేర్కొన్నారు.