శాంపేన్ బాటిల్ అడుగు భాగాన్ని చూస్తున్న కోహ్లీ!... సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫొటో!
- ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా
- సంబరాల్లో శాంపేన్ బాటిల్ చేతబట్టిన కోహ్లీ
- ఫొటోను పోస్ట్ చేసిన ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో
ఈ ఫొటో ట్విట్టర్లో చేరినంతనే క్రికెట్ అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఓ మిడిల్ క్లాస్ యువకుడి మాదిరిగా శాంపేన్ బాటిల్ ధరను కోహ్లీ చూస్తున్నాడంటూ కొందరు వ్యాఖ్యానించగా...అదేమీ కాదు దాని ఎక్స్ పైరీ డేట్ను కోహ్లీ పరిశీలిస్తున్నాడని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అయితే... శాంపేన్ ధర సామాన్యులకు అందుబాటులోనే ఉందా? లేదా? అనే విషయాన్ని కోహ్లీ పరిశీలిస్తున్నాడని కామెంట్ చేశాడు. మొత్తంగా రకరకాల కామెంట్లతో శాంపేన్ బాటిల్ను చేతబట్టిన కోహ్లీ ఫొటో తెగ వైరల్గా మారిపోయింది.