గాల్లో ఉన్న ఎయిరిండియా విమానంలో పిచ్చుక కలకలం

బహ్రెయిన్ నుంచి కొచ్చి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ పిచ్చుక కలకలం రేపింది. జులై 15న ఈ విమానం గాల్లో ప్రయాణిస్తుండగా, కాక్ పిట్ లో చిన్న పక్షిని గుర్తించారు. ఆ సమయంలో విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది.

బహ్రెయిన్ ఎయిర్ పోర్టులోనే ఫ్లయిట్ ఇంజినీర్ దాన్ని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేయగా, ఆ పక్షి తుర్రుమంటూ ఎగిరి ఫ్లయిట్ డెక్ లోకి ప్రవేశించింది. విమానం సగం దూరం ప్రయాణించిన తర్వాత అది కాక్ పిట్ లోకి వచ్చింది. ఈ బోయింగ్ 737 విమానం కొచ్చిలో ల్యాండయిన తర్వాత ఆ పక్షిని పట్టుకున్నారు. దాన్ని వెలుపలికి తీసుకువచ్చి వదిలేశారు. 

అయితే, ఇది విమాన భద్రతకు సంబంధించిన అంశం కావడంతో డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. విమానంలో పక్షి దూరడంపై విచారణకు ఉపక్రమించింది.

Bird
Air India
Plane
Bahrain
Cochi
DGCA

More Telugu News