రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన రద్దు.. కారణమిదే..!
- షెడ్యూల్ ప్రకారం నేడు రాష్ట్రానికి రావాల్సిన ద్రౌపది
- వర్షాల కారణంగా టూర్ రద్దు
- బీజేపీ ప్రజా ప్రతినిధులను ఢిల్లీకి ఆహ్వానించిన ముర్ము
ఓ హోటల్లో గిరిజన, ఆదివాసీ వర్గాల నాయకులు, ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతో ద్రౌపది ముర్ము విడివిడిగా సమావేశం అయ్యేలా ప్రణాళిక రచించారు. ఆమెకు ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేశారు. రోడ్ షో కూడా నిర్వహించాలని అనుకున్నారు. అయితే వర్షాల కారణంగా ముర్ము తన టూర్ ను రద్దు చేసుకున్నారు. మొదట ఆమె టూర్ వాయిదా అని బీజేపీ వర్గాలు చెప్పినప్పటికీ, చివరకు ముర్ము తన టూర్ ను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టూర్ రద్దవడంతో తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను ముర్ము ఢిల్లీకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.