మోదీ హెలికాప్టర్కు అత్యంత సమీపంలో బెలూన్లు... ఆందోళన రేకెత్తించిన ఘటన వీడియో ఇదిగో
- మోదీకి నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ యత్నం
- మోదీ హెలికాప్టర్ గాల్లోకి లేచిన వెంటనే బెలూన్లు వదిలిన కాంగ్రెస్ నేత రాజీవ్ రతన్
- ఆ వెంటనే పరారైపోయిన నేత
- రాజీవ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్న ఏపీ పోలీసులు
మోదీ హెలికాప్టర్కు అత్యంత సమీపంలోకి వచ్చిన ఈ బెలూన్లను చూసిన ఎస్పీజీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే ఆ బెలూన్లు మరింతగా దగ్గరకు వచ్చేలోగానే మోదీ హెలికాప్టర్ భీమవరం దిశగా దూసుకుపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీకి అన్యాయం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు మోదీకి నిరసన తెలిపేందుకే ఇలా చేశారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఎస్పీజీ కమాండోల ఆదేశాలతో క్షణాల్లో రంగంలోకి దిగిపోయిన ఏపీ పోలీసులు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ రతన్ అనే నేత ఈ ఘటనకు కారకుడని తేల్చారు.
అయితే మోదీకి వ్యతిరేకంగా బెలూన్లు వదిలిన రాజీవ్ మాత్రం ఆ వెంటనే పరారయ్యారు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఎలా అంటూ ఎస్పీజీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.