రెవెన్యూ డివిజ‌న్లుగా పులివెందుల... తుది నోటిఫికేష‌న్ విడుద‌ల‌

pulivendula and kottapeta upgraded to revenue divisions
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల కూడా రెవెన్యూ డివిజ‌న్‌గా మారిపోయింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం గురువారం తుది నోటిఫికేష‌న్ జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సంద‌ర్భంగా ఆయా జిల్లాల సంఖ్య‌కు అనుగుణంగా ప‌లు ప‌ట్ట‌ణాల‌ను రెవెన్యూ డివిజ‌న్లుగా అప్‌గ్రేడ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క్రియ అంతా ఎప్పుడో పూర్తి అయిపోయింది.

ఆ త‌ర్వాత పులివెందుల‌తో పాటు కోన‌సీమ జిల్లాలోని కొత్త‌పేట‌ను కూడా రెవెన్యూ డివిజ‌న్ గా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్లు వ‌చ్చాయి. వీటిని ప‌రిశీలించిన ప్ర‌భుత్వం ఆ రెండు ప‌ట్ట‌ణాల‌ను కూడా రెవెన్యూ డివిజ‌న్లుగా ఏర్పాటు చేసే ప్రక్రియ‌ను మొద‌లుపెట్టింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం... దాని గ‌డువు ముగిసిపోవడంతో తుది నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.
Go Back to Shorts
YSRCP
Andhra Pradesh
YS Jagan
Pulivendula
Kottapeta
Kadapa District
Dr BR Ambedkar Konaseema District
Revenue Division

More Telugu News