పంత్ వికెట్ ను జడేజా పడగొడితే.. సంబరాలు ఇలా..!

  • లీచెస్టర్ షైర్ లో రెండో రోజు ఆసక్తికర దృశ్యం
  • 46వ ఓవర్లో పంత్ కొట్టిన క్యాచ్ ను పట్టేసిన అయ్యర్
  • పంత్ తో కలసి సంబరాలు చేసుకున్న భారత ఆటగాళ్లు
ఇంగ్లండ్ తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన భారత జట్టు.. స్థానిక జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడుతోంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు కొందరు ప్రత్యర్థి జట్టులో సభ్యులుగా ఉన్నారు. రిషబ్ పంత్ కూడా అందులో ఒకడు. దీంతో రిషబ్ పంత్ వికెట్ ను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తీయడం ఆసక్తిని కలిగించింది. 

లీచెస్టర్ షైర్ లో ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు (శుక్రవారం) ఇది చోటు చేసుకుంది. 87 బంతుల్లో పంత్ 76 పరుగులు సాధించాడు. 46వ ఓవర్ ను జడేజా వేస్తుండగా రెండో బంతికి పంత్ కొట్టిన క్యాచ్ ను శ్రేయాస్ అయ్యర్ సులభంగా పట్టేశాడు. దీంతో పంత్ ను రవీంద్ర జడేజా గుండెలకు హత్తుకున్నాడు. పెవిలియన్ బాట పట్టకుండా పంత్ కూడా అక్కడే భారత క్రికెటర్లతో కలసి తన వికెట్ ను తీసిన సంతోషాన్ని పంచుకున్నాడు. చూసేవారిని ఇది ఆకర్షించింది.


More Telugu News

Rishabh Pant Ravindra Jadeja Leicestershire celebration practice match