బెంగళూరు సిటీ పని అయిపోయింది: కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి
- బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా ఉందన్న మంత్రి
- మోదీ కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడి
- ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం ఖాయమన్న ఉమేశ్
మన దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు ఉండబోతున్నాయని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోందని చెప్పారు. బెంగళూరు సిటీ పని అయిపోయిందని అన్నారు. తన ఇంటి నుంచి విధాన సౌధకు 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉందని... కానీ, అక్కడకు వెళ్లడానికి గంటన్నరకు పైగా సమయం పడుతుందని చెప్పారు. బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఐటీ, బీటీ, పరిశ్రమలు పెరిగి తాగునీటి సమస్య కూడా తలెత్తవచ్చని చెప్పారు.