CRPF: మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

  • ఒడిశాలో భద్రతాబలగాలపై నక్సల్స్ దాడి
  • ఓ క్యాంపు నుంచి మరో క్యాంపునకు వెళుతుండగా కాల్పులు
  • అదనపు బలగాలను తరలించిన అధికారులు
  • నక్సల్స్ కోసం కూంబింగ్
Three CRPF Jawans killed in Naxals firing

ఒడిశాలో మావోయిస్టులు అదను చూసి భద్రతాబలగాలను దెబ్బకొట్టారు. నౌపడా ప్రాంతంలోని పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓ క్యాంపు నుంచి మరో క్యాంపునకు వెళుతున్న సీఆర్పీఎఫ్ బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి. మరణించినవారిని ఏఎస్ఐ శిశుపాల్ సింగ్, సిబ్లాల్, ధర్మేంద్ర కుమార్ సింగ్ గా గుర్తించారు. 

ఈ కాల్పుల ఘటనతో పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒడిశాలో స్తబ్దుగా ఉన్న నక్సల్స్ ఉనికి చాటుకోవడం కోసమే ఈ దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో మావోలు భారీ ఆయుధ సంపత్తిని వినియోగించినట్టు కాల్పులు జరిగిన స్థలంలో లభ్యమైన ఆధారాలు చెబుతున్నాయి.

More Telugu News