ఉక్రెయిన్ చిన్నారుల కోసం తన నోబెల్ బహుమతిని వేలానికి ఇచ్చేసిన రష్యా పాత్రికేయుడు

Russian journo Dmitry Muratov gave away his Nobel Peace Prize to auction
  • గతేడాది నోబెల్ గెలుచుకున్న దిమిత్రి మురతోవ్
  • నొవయా గెజెటా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న మురతోవ్
  • రష్యా దాడుల్లో శరణార్థులుగా మారిన ఉక్రెయిన్ చిన్నారులు
  • చలించిపోయిన మురతోవ్
రష్యన్ పత్రిక నొవయా గెజెటా ఎడిటర్ ఇన్ చీఫ్ దిమిత్రి మురతోవ్ నోబెల్ బహుమతి విజేత. ఆయనకు 2021లో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. సొంతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ ఇచ్చారు. 

అయితే, గత కొన్నినెలలుగా రష్యా జరుపుతున్న దాడుల్లో వందలాది మంది ఉక్రెయిన్ చిన్నారులు శరణార్థులుగా మారి పొరుగుదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఆ చిన్నారుల పరిస్థితి పట్ల నోబెల్ విజేత దిమిత్రి మురతోవ్ చలించిపోయారు. ఆ బాలలకు సాయం చేసేందుకు గాను, తన నోబెల్ బహుమతిని వేలం వేసేందుకు ఇచ్చేశారు. 

ఇప్పుడా నోబెల్ పీస్ ప్రైజ్ కు వేలంలో రూ.807 కోట్ల ధర పలికింది. అమెరికా సంస్థ హెరిటేజ్ ఆక్షన్స్ ఈ నోబెల్ శాంతి బహుమతిని వేలం వేసింది. ఈ నోబెల్ అవార్డును వేలంలో దక్కించుకుంది ఎవరో మాత్రం హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ వెల్లడించలేదు. వచ్చిన నిధులను ఉక్రెయిన్ బాల శరణార్థుల కోసం వినియోగించనున్నారు.
Go Back to Shorts
Dmitry Muratov
Nobel
Auction
Children
Ukraine
Russia

More Telugu News