Revanth Reddy: వెనుక ద్వారం నుంచి గాంధీ ఆసుపత్రిలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి

  • సికింద్రాబాద్ రైల్వే హింస సందర్భంగా కాల్పులు
  • గాయపడిన వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స
  • పరామర్శించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy visits Gandhi Hospital

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారగా, పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించడం, మరికొందరు గాయపడడం తెలిసిందే. గాయపడిన వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం గాంధీ ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆసుపత్రి వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా పోలీసులకు, రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

More Telugu News