సికింద్రాబాద్ అల్లర్ల ఎఫెక్ట్.. మెట్రో సర్వీసులు కూడా రద్దు
- అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ స్టేషన్లో ఆందోళన
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇప్పటికే రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు
- ఇంకా పట్టాలపైనే వందలాది మంది ఆందోళనకారులు
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. పట్టాలపైనే నిరసన కారులు బైఠాయించారు. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఆర్మీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టి, స్టేషన్ పరిసరాల్లోని ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. వాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు 11 రౌండ్ల పాటు కాల్పులు జరపగా... ఒకరు చనిపోయారని, పలువురు గాయపడ్డారని తెలుస్తోంది.